Rain Alert: ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరోసారి బిగ్ అలర్ట్. మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఈ నెల 25వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిస్సా అలాగే పశ్చిమగోదావరి తీరాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని ఈ సందర్భంగా వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

దీని ప్రభావంతో 26 అలాగే 27 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం అలాగే విజయనగరం లాంటి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ రెండు రోజులపాటు మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. కాగా రెండు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఆగిన సంగతి తెలిసిందే.