రెండు రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసినా వాతావరణ శాఖ

-

రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశించినప్పటికీని కూడా రైతులతో మాత్రం వర్షాలు దోబుచులాడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో నల్లటి మేఘాలు పట్టినప్పటికీ వర్షాలు మాత్రం పడటం లేదు.దీంతో పూర్తిగా వర్షాల పై ఆదారపడిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు.

ఈ క్రమంలో తెలంగాణ రైతులకు హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా వరంగల్,ములుగు, కొత్తగూడెం,ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో గంటలకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.ఇక ఈ జిల్లాలకు వాతావరణ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాగా శనివారం రాత్రి నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో తుఫాన్ మాదిరిగా చిరు జల్లులు కురుస్తున్నాయి. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news