రాజమౌళి : తన పారితోషకంలో ఎక్కువ భాగం దేనికోసం ఖర్చు పెడతారో తెలుసా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో రాజమౌళి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఈయన డైరెక్టర్ గా చేసింది కొన్ని సినిమాలే అయినా భారీ పాపులారిటీ దక్కించుకున్న డైరెక్టర్ కావడం గమనార్హం. ముఖ్యంగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాతో అంతర్జాతీయంగా ఉన్న దర్శకులు, రచయితలు, పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమా పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా తర్వాత రాజమౌళి పారిపోషకం కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఒకవైపు పారితోషకం తీసుకుంటూనే మరొకవైపు సినిమా లాభాలలో వాటా తీసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ఈయన పారితోషకం భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది . ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని రాజమౌళి మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా కోసం ఏకంగా రూ. 100 కోట్ల పారితోషకం తీసుకోబోతున్నారట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి తన పారితోషకంలో ఎక్కువ భాగం దేనికోసం ఖర్చు పెడతారు అనే విషయానికి వస్తే ఆయన తీసుకునే పారితోషకంలో ఎక్కువగా సినిమాల కోసం అవసరం అయ్యే వస్తువులకే ఎక్కువగా ఖర్చు చేస్తారట. కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి రాజమౌళి తెగ ఆసక్తి చూపిస్తారు అని.. అందుకే సినిమాలకు ఉపయోగపడే వస్తువుల కోసం ఆయన తన పారితోషకాన్ని వెచ్చించి మరి కొనుగోలు చేస్తారని సమాచారం. సినిమా మీద ఉన్న డెడికేషన్ తో ఆయన ఇంతలా పనిచేస్తూ ఉండడం నిజంగా హాట్సాఫ్ అంటున్నారు సినీ ప్రేక్షకులు.

Read more RELATED
Recommended to you

Latest news