Rajamouli: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై రాజమౌళి అసహనం.. వీధి కుక్కలు ఉన్నాయంటూ ట్వీట్

-

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. బాహుబలి లాంటి మూవీలతో మంచి పేరు తెచ్చుకున్నారు జక్కన్న. అయితే అలాంటి ఈ స్టార్ డైరెక్టర్ ఢిల్లీ ఎయిర్ పోర్టులోని… పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు. అంతే కాదు ట్విట్టర్ వేదికగా ఢిల్లీ ఎయిర్ పోర్టు పరిస్థితులపై స్పందించారు.

“లుఫ్తాన్సా ఫ్లైట్ ద్వారా ఎయిర్ పోర్ట్ లోకి వచ్చినప్పుడు ఆర్టిపిసిఆర్ పరీక్షల కోసం ప్రయాణికులకు పత్రాలను అందించారు. అయితే ఆ పత్రాలను నింపడానికి ప్రయాణికులు.. కొందరు నేలపై కూర్చుని ఉంటే, మరికొందరు గోడపై నుంచి నింపుతున్నారు. టేబుల్స్ ను ఏర్పాటు చేయడం అనేది చాలా సాధారణ సర్వీసు.. దాన్ని అందించాల్సి ఉంది. అలాగే వెలుపల ద్వారం వద్ద ఉండే హ్యాంగర్ దగ్గర వీధి కుక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సన్నివేశాలను చూసినప్పుడు విదేశీయులు మన దేశంపై కలిగే మొదటి అభిప్రాయం మరోలా ఉంటుంది. ఈ విషయంపై దృష్టి సారించండి.” అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై ఢిల్లీ ఎయిర్ పోర్టు అథారిటీ ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే. కాగా ప్రస్తుతం రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు

Read more RELATED
Recommended to you

Latest news