రాజ‌శేఖ‌ర్ కూడా థ్రిల్ల‌ర్‌తో గేమ్ షురూ చేస్తున్నారు!

-

లాక్‌డౌన్‌లో అన్‌లాక్ ప్ర‌క్రియ మొద‌లైంది. దీంతో గత ఏడు నెల‌లుగా షూటింగ్‌ల‌కు దూరంగా వుంటూ వ‌చ్చిన స్టార్స్ ఒక్కొక్క‌రుగా సెట్‌లోకి ఎంట‌ర‌వుతున్నారు. సంద‌డి చేస్తున్నారు. తాజాగా యాంగ్రీయంగ్‌మెన్ డా.రాజ‌శేఖ‌ర్ కూడా సెట్‌లోకి ఎంట‌ర‌య్యారు. త‌న గేమ్ షురూ చేశారు. `పీఎస్‌వీ గ‌రుడ వేగ‌` చిత్రంతో మ‌ళ్లీ లైన్‌లోకి వ‌చ్చిన రాజ‌శేఖ‌ర్ రెట్టించిన ఉత్సాహంతో చేసిన చిత్రం `క‌ల్కి`. అదాశ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది.

ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ రాజ‌శేఖ‌ర్ కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ త‌న‌దైన స్టైల్లో కొత్త థ్రిల్ల‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. `మిస్స‌మ్మ‌` ఫేమ్ నీకంఠ ద‌ర్శ‌క‌త్వంలో రాజ‌శేఖ‌ర్ ఓ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని చేస్తున్నారు. ఓ హిట్ ఫిల్మ్‌కు రీమేక్‌గా రానున్న ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్‌గా క‌నిపి్తార‌ట‌. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల 7 నుంచి ప్రారంభం కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news