రాజాసింగ్ కి బెదిరింపు కాల్.. శ్రీరామ నవమి రోజు శోభయాత్ర తీస్తే చంపేస్తాం..!

-

తెలంగాణలోని గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. రాజాసింగ్ నిత్యం ఏదో ఒక విషయం పై వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ కి బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. శ్రీరామనవమి రోజున శోభయాత్ర తీస్తే.. చంపేస్తామని కొందరూ ఫోన్ లు చేసి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారని స్వయంగా ఓ వీడియోను విడుదల చేసి వెల్లడించారు రాజాసింగ్.

ఫోన్ లు చేసి బెదిరించడం కాదని.. దమ్ముంటే నేరుగా రావాలని ఛాలెంజ్ చేశారు రాజాసింగ్. గతంలో కూడా ఇదే విధంగా బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పారు. ఇలాంటి బెదిరింపులు తనను ఏం చేయలేదని అన్నారు. బెదిరింపులకు పాల్పడే వారు ఎంత స్థాయి వ్యక్తులు అయినా తనకు అనవసరం అని.. దమ్ముంటే నేరుగా రావాలని.. లేకుంటే ఫోన్లు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version