దొంగల నాయకుడు కేసీఆర్ అయితే..టిఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీ : రాజా సింగ్

-

ఉద్యమ ద్రోహులను, భూకబ్జాదారులను, దోపిడీదొంగలతో టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిపోయిందని.. దొంగల ముఠా నాయకుడు కేసీఆర్ కు ప్రధానమంత్రిని, బీజేపీని విమర్శించే నైతిక అర్హత లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ ఫైర్ అయ్యారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ తప్పుపట్టడం సిగ్గు చేటు అని.. ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది? పార్లమెంట్ తలుపులు మూసి, మైకులు బంద్ చేసి కనీస చర్చల్లేకుండా తెలంగాణ బిల్లు పెట్టిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు.

కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ర్పే చల్లుతూ గొడవ చేసిన మాట నిజం కాదా? కాంగ్రెస్ విధానాలవల్లే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోయిన మాటల్లో నిజం లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను తిడితే కేసీఆర్ కు, టీఆర్ఎస్ నేతలకు వచ్చిన నొప్పేంది? కాంగ్రెస్ – టీఆర్ఎస్ నాయకులు దొందూ దొందేనని దీంతో స్పష్టమైందన్నారు. ఒకవైపు మజ్లిస్ నేతలతో ఇంకోవైపు కాంగ్రెస్ తో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న టీఆర్ఎస్ నేతలకు సిగ్గు లేదని.. రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటున్న తరుణంలో ఆ చర్చను డైవర్ట్ చేసేందుకే నిరసనల పేరుతో టీఆర్ఎస్ డ్రామాలాడుతోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version