BREAKING : నటుడు రాజేంద్ర ప్రసాద్‌ కు కరోనా..ఆస్పత్రి చికిత్స

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమను కరోనా థర్డ్‌ వేవ్‌ కుదిపేస్తుంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖ హీరోలు, నటులు కరోనా మహమ్మారి భారీన పడ్డారు. ఇక తాజాగా టాలీవుడ్ స్టార్‌ నటుడు, పాత హీరో రాజేంద్ర ప్రసాద్‌ కు కూడా కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను హైదరాబాద్‌ నగరంలోని ఎఐపీ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.

నిన్నటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ను ఎఐపీ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు ఆయన కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా ఆయనకు కరోనా పరీక్షలు చేస్తే… పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఇక ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

అలాగే.. ఆయన ఆరోగ్యం కూడా చాలా నిలకడగానే ఉందని చెబుతున్నారు వైద్యులు. ఆయన అభిమానులు ఎవరూ కూడా ఆందోళన చెందనవసరం లేదని కుటుంబ సభ్యులు మీడియా ద్వారా పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం రాజేంద్ర ప్రసాద్‌ హెల్త్‌ బులిటెన్ విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news