గ్లామర్ తో మెస్మరైస్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

-

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీ ద్వాారా తెలుగు తెరకు పరిచయం అయిన రకుల్ ప్రీత్ సింగ్… ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు గడిచింది. తన అందం, అభినయం ద్వారా అనతి కాలంలోనే స్టార్ హీరోలతో ఛాన్స్ లు కొట్టేసింది. స్టార్ హీరోల ఫస్ట్ చాయిస్ గా మారింది. 

తాజాగా ఈ అమ్మడు తన గ్లామర్ తో అందాలను ఒలకబోస్తోంది. వైట్ డ్రెస్, కొంచె చూపులతో కవ్విస్తోంది. తన అందంతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. గతంలో కూడా తన గ్లామర్ పిక్స్ ను ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో షేర్ చేస్తోంది. 

తాజాగా తెలుగులో పెద్ద అవకాశాలు లేకున్నా… ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు దగ్గరగానే ఉంటుంది. తెలుగులో ఏడాది క్రితం వచ్చిన ‘ కొండపొలం’ చివరి సినిమా. ఆ తరువాత పెద్దగా తెలుగు అవకాశాలు రాలేదు రకుల్ ప్రీత్ సింగ్ కి.

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన రకుల్ ఆతరువాత వరసగా తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని ఇండస్త్రీల్లోనూ సత్తా చాటింది. 

తెలుగులో రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, గోపీ చంద్, మహేష్ బాబు వంటి అగ్ర కథానాయకులతో ఆడిపాడింది. ‘ నాన్నకు ప్రేమతో’, ధ్రువ, స్పైడర్ సినిమాలు రకుల్ ప్రీత్ సింగ్ కు మంచి పేరు తీసుకువచ్చాయి. 

ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీతో రిలేషన్ షిప్ లో ఉంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం తమిళ్, తెలుగు భాషల్లో వస్తున్న లేడీస్ నైట్ సినిమాలో నటిస్తోంది. కమల్ హాసన్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ ఇండియన్ 2’ సినిమాలో కూడా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news