చెల్లితో క‌లిసి ముంబైలో రామ్ చ‌ర‌ణ్‌.. ఫొటోలు వైర‌ల్

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌..ఒక్క సారిగా ముంబై మహా నగరంలో ప్రత్యక్ష మయ్యాడు. తన చెల్లెలు… శ్రీజ తో కలిసి.. రామ్‌ చరణ్‌ ముంబై వచ్చాడు. అయితే.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. తమ పెంపుడు కుక్క రైమ్‌ ను కూడా వారు తమతో పాటు తీసుకు వెళ్లారు. విమానంలో ఎయిర్‌ పోర్టు ఆవరణలో వారు ఫోటోలు దిగారు.

శ్రీజ తో కలిసి చెర్రీ ముంబైకి ఎందుకు వెళ్లాడన్న విషయంపై ఇక వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. హీరో రామ్‌ చరణ్‌ తాజాగా నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌. ఆచార్య చిత్రాలు విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి నేపథ్యంలో.. ఆ రెండు సినిమాలు వాయిదా పడ్డాయి.

కరోనా తగ్గు ముఖం పట్టాక ఈ సినిమాలను విడుదల చేయాలని ఆ సినిమా యూనిట్లు భావిస్తున్నాయి. ఇప్పటికే విడుదలకు సంబంధించి కొత్త తేదీలను కూడా విడుదల చేశాయి. షూటింగ్‌ లకు విశ్రాంతి దొరకడంతో రామ్‌ చరణ్‌ ముంబై వెళ్లి నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news