జగన్ సర్కార్ పై పట్టాభి సంచలన వ్యాఖ్యలు

-

జగన్‌ సర్కార్‌ పై టీడీపీ నేత పట్టాభి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా తయారైందని ఆగ్రహించారు. జగనన్న గోరుముద్ద పథకంలో అవినీతి జరుగుతోందని నిప్పులు చెరిగారు. కేంద్రం 60 శాతం వాటాలు ఉన్న కంపెనీలను కూడా జగన్‌ సర్కార్‌… వెనక్కి వెళ్లేలా చేసిందని నిప్పులు చెరిగారు.

జగన్‌ సర్కార్‌ కు కావాల్సిన కంపెనీలకు మాత్రమే… అనుమతులు ఇస్తున్నారని.. ఇతర కంపెనీలకు కొత్త రూల్స్‌ పెట్టి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా చేస్తున్నారని ఆగ్రహించారు. అన్ని కంపెనీలను డిస్‌ క్వాలీఫై చేస్తున్నారని మండి పడ్డారు. పీఆర్సీ వ్యవహారం ఆంధ్ర ప్రదేశ్‌ లో నడుస్తోందని.. ఆ వ్యవహారాన్ని ఏపీ ప్రజలు మార్చి పోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో.. కొత్త జిల్లాలను తీసుకువస్తున్నారని నిప్పులు చెరిగారు. జగన్‌ సర్కార్‌.. ఏపీ ప్రజలు రక్తం తాగేలా వ్యవహరిస్తుందని.. ప్రజలు దీనికి గమనించాలని కోరారు టీడీపీ నేత పట్టాభి.

Read more RELATED
Recommended to you

Latest news