పోచమ్మ బోనాల పండుగ‌లో రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న హ‌ల్‌చ‌ల్‌ !

-

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గడికోట వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు.
గ‌డికోట సంస్థానాధీశుల కామినేని అనిల్ కుమార్ శోభన రెండో కూతురు వివాహ సందర్భంగా పోచమ్మ బోనాల‌ పండుగకు మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీ వ‌చ్చింది. మెగాస్టార్ కుటుంబంతో పాటు, కామినేని కుటుంబ సభ్యులు కూడా హాజ‌ర‌య్యారు.

అయితే.. ఈ పోచమ్మ పండుగలో సినీ హీరో రామ్ చరణ్ తేజ, ఉపాసన హల్ చ‌ల్ చేశారు. ఆ వేడుక‌లో పాల్గొని అంద‌రినీ క‌నివిందు చేశారు. అయితే.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. రామ్ చరణ్ తేజ, ఉపాసన జంట మాత్ర‌మే.. ఫోటోలు దిగుతూ… సంద‌డి చేసింది.  కాగా.. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌ ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు షూటింగ్‌ చివరి దశకు వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో చిత్ర బృందం బిజీ గా ఉంది.  వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆచార్య సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news