భీమ్లా నాయక్ సినిమాకు ఆ టైటిల్ పెట్టి ఉంటే బాగుండేది… రామ్ గోపాల్ వర్మ..!

-

రామ్ గోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు కెరీర్ లో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ లతో దర్శకుడిగా ఇండియా రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్నడు. అయితే ప్రస్తుతం మాత్రం రామ్ గోపాల్ వర్మ ఆ రేంజ్ విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనుకబడి పోయాడు. అలా సినిమాల విజయాల పరంగా రామ్ గోపాల్ వర్మ కాస్త స్లో అయినప్పటికీ సినిమాలను తెరకెక్కించడంలో విషయంలో మాత్రం ఏ మాత్రం స్లో అవ్వలేదు.

ఇది ఇలా ఉంటే రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా ఏదో ఎప్పుడు ఏదో ఒక విషయం పై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఇలా అనేక విషయాలపై స్పందిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కిన తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ పై తనదైన రీతిలో స్పందించాడు. పికే ఫ్యాన్స్ అంటూనే రామ్ గోపాల్ వర్మ చేయాల్సిన కామెంట్లు చేసేసాడు.

అయితే ఈ సినిమా చూశాక ఈ మూవీ టైటిల్ ‘భీమ్లా నాయక్’ బదులు ‘డానియల్ శేఖర్’ అని పెట్టాల్సింది అంటూ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్లు చేశాడు. ఇది ఇలా ఉంటే భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ , దగ్గుబాటి రానా సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news