విజయసాయి కోసమే విశాఖ రాజధాని – ఎంపీ రామ్మోహన్ నాయుడు

-

విజయసాయి కోసమే విశాఖ రాజధాని అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు అమరావతిని ల్యాండ్ పూలింగ్ రాజధానిగా చేస్తే.. విశాఖను జగన్ ల్యాండ్ గ్రాబింగ్ రాజధానిగా మార్చారని ఆగ్రహించారు. విజయసాయి కోసమే విశాఖ రాజధానని.. విశాఖకు విజయసాయి రాజులా మారారు.. భూములు తనవే అంటున్నారని మండిపడ్డారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.

ఇతర ప్రాంతాలకు చెందిన వైసీపీ మంత్రులు మాట్లాడేది ఉత్తరాంధ్రపై ప్రేమతో కాదు.. విశాఖ భూములపై ప్రేమతో… అని మండిపడ్డారు. విశాఖలో భూమి ఉంటే భరోసా అని గతంలో ఉండేది.. ఇప్పుడు విశాఖలో భూమి ఉంటే భయం పట్టుకుంది.అన్ని ప్రాంతాలను సమానంగా చూడడం తెలుగు ప్రజల గొప్పదనమన్నారు. మందస కోవాను ఇష్టపడతారు.. రాగి సంకటిని ఇష్టపడతారని తెలిపారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news