శ‌ర్వానంద్ కోసం రంగంలోకి రామ్‌చ‌ర‌ణ్‌.. ఆ సినిమాతో స్టార్ మారుతుందా?

-

టాలీవుడ్‌లో శ‌ర్వానంద్ అంటే మంచి ట్యాలెంట్ ఉన్న న‌టుడు. స్వ‌త‌హాగా త‌న న‌ట‌న‌తోనే ఎదిగిన శ‌ర్వానంద్ మీడియం రేంజ్ స్టార్ హీరోగా కొన‌సాగుతున్నాడు. అయితే శ‌ర్వానంద్‌కు రామ్‌చ‌ర‌ణ్ మంచి స్నేహితుడు. ఇండ‌స్ట్రీలో వీరి జోడీకి మంచి పేరుంది. అయితే శ‌ర్వానంద్ స్టార్‌ను మార్చేందుకు ఇప్పుడు రంగంలోకి రామ్‌చ‌ర‌ణ్ దిగిన‌ట్టు తెలుస్తోంది.

శ‌ర్వానంద్

ఇందుకోసం స్టార్ డైరెక్ట‌ర్ అయిన‌ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను లైన్‌లో పెడుతున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. త్రివిక్ర‌మ్ ఎక్కువగా పెద్ద హీరోలతోనే సినిమాలు చేస్తూ ఉంటాడ‌న్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కోసం శ‌ర్వానంద్‌తో చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

కాగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ సినిమాను చేస్తున్నాడు త్రివిక్ర‌మ్‌. సర్కారు వారి పాట సినిమా పూర్త‌య్యాక ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. దానికి ఇంకో ఏడాది కూడా ప‌ట్ట‌వ‌చ్చు. మ‌రి ఈ సినిమా పూర్త‌వ్వాలంటే 2023వ‌ర‌కు టైమ్ ప‌డుతుంది. మ‌రి అప్ప‌టి వేచిచూస్తాడా లేక మ‌హేశ్ స‌ర్కారువారిపాట పూర్త‌య్యేలోపు శ‌ర్వానంద్‌తో మూవీ పూర్తి చేస్తాడా అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీని రామ్ చరణ్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news