అలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పాల్సిందే : జబర్దస్త్ యాంకర్ రష్మి

-

జబర్దస్త్ యాంకర్, ప్రముఖ నటి రష్మీ గౌతమ్… పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. యాంకరింగ్ తో పాటు పలు సినిమాల్లో నటిగా మరియు హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది ఈ భామ. నటనతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.. జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్. ముఖ్యంగా జంతువుల పట్ల… ఎంతో జాలిగా వ్యవహరిస్తుంది.

అయితే తాజాగా ఓ నెటిజన్.. షేర్ చేసిన వీడియో పై చాలా సీరియస్ గా స్పందించింది రష్మీ. ఓ పెంపుడు కుక్క ను… చిత్రహింసలు పెడుతూ అలహాబాద్ కు చెందిన ఓ వ్యక్తి దౌర్జన్యంగా వ్యవహరించాడు. ఆ కుక్క మెడ పై కాలు పెట్టి… హింసించాడు ఆ వ్యక్తి.

అయితే ఆ వీడియోను ఓ నెటిజెన్ షేర్ చేయగా… దానిపై రష్మి గౌతమ్ చాలా సీరియస్ కామెంట్ చేసింది. “కుక్కను హింసించడంతోనే ఆ మనిషి ఎదుగుదల దిగజరిపోయింది. అతనిని పూర్తిగా నిందించలేము. తల్లి దండ్రులు పిల్లలకు కనికరం నేర్పించాల్సిన అవసరం ఉంది. అయితే అతని తల్లి దండ్రులు కాస్త సంస్కారం నేర్పించాల్సి ఉంది. ఇలాంటి మూర్ఖుల మేము బుద్ది చెబుతాం” అంటూ రష్మి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news