సూపర్ స్టార్ పునీత్ తలుచుకొని ఎమోషనల్ అయిన రష్మిక..!!

-

హీరోయిన్ రష్మిక కర్ణాటక స్వంత రాష్టం అని అందరకీ తెలిసిందే. మొదట కన్నడ నుండి తెలుగుకు వచ్చి మెల్లిగా ఒక్కో సినిమా చేసుకుంటా పుష్ప సినిమా తో పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లి పొయింది. ఇక అమ్మడి చేతిలో ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పడు కర్నాటక లో కాంతారా సినిమా విషయంలో రస్మిక మీద విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇక ఆమె సినిమాలను బ్యాన్ చేయాల్సిందిగా టాక్ నడుస్తోంది.

రీసెంట్ గా సోషల్‌ మీడియా వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. రష్మిక మొదట కన్నడ సినిమా కిర్రక్ పార్టీ ద్వారా వెండతెరకు పరిచయం అయ్యింది.ఆ సినిమా తర్వాత అంజనీ పుత్ర లో నటించింది. గతేడాది చివరిలో గుండెపోటుతో మరణించిన దివంగత సూపర్‌స్టార్‌ పునీత్ రాజ్‌ కుమార్‌ ఈ చిత్రంలో హీరో. హర్ష దర్శకత్వం వహించిన ఈ విడుదలై ఐదేళ్లు పూర్తి అయిన సందర్భంగా అప్పు సార్‌తో ఉన్న అనుబంధాన్ని పొస్ట్ లో ఎమోషనల్ గా పొందు పరిచింది.

ఈరోజుతో అంజనీపుత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నేను పునీత్ రాజ్‌కుమార్‌తో ఉన్న సమయం అమూల్యం  పునీత్ సార్ నాపై ఎక్కువ నమ్మకంతో ఉండేవారు. ఆయన గొప్ప మనసున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి స్థానాన్ని నామనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది అంటూ ఈ మూవీ లో నటించే  అవకాశం కల్పించిన హర్ష సార్‌కు థాంక్యూ’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news