‘పుష్ప2’లో పాత్రపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

-

లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను రిలీజ్ చేయాలనీ మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

మొదటిభాగంలో శ్రీవల్లిగా అలరించిన రష్మిక ,రెండో పార్ట్‌ లో తన పాత్రపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మొదటిభాగం చివర్లో పుష్పరాజ్‌కు శ్రీవల్లితో పెళ్లి అయినట్లు చూపిన విషయం తెలిసిందే. ఇదే మాటను రష్మిక చెప్పారు. ‘నేను రెండో పార్ట్‌లో పుష్పకు భార్యగా కనిపిస్తాను.ఇందులో ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఈ సీక్వెల్‌ మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది అని అన్నారు. సుకుమార్‌ ప్రతీ సన్నివేశాన్ని పర్‌ఫెక్ట్‌గా తీస్తారు అని చెప్పింది. ఫస్ట్ పార్ట్ కి భారీ స్థాయిలో స్పందన రావడంతో రెండో పార్ట్‌పై అధిక అంచనాలు నెలకొన్నాయి. సీన్స్‌లో ఎంత బాగా నటించగలమనేది ఆర్టిస్టులపై ఆధారపడి ఉంటుంది అని రష్మిక తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news