తెల్ల పంచ కట్టి, మెరిపోతున్న జడేజా..రాజకీయాల్లోకి ఎంట్రీ !

-

టీమ్ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కీలకమైన ఆటగాడు. అయితే ఇటీవల తీవ్ర గాయంతో మోకాలికి ఇచ్చే శస్త్ర చికిత్స చేయించుకున్న అతడు ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ కప్ నకు దూరం అయ్యాడు. ఇక ఇటీవలే కోలుకున్న జడేజా, తన భార్య ను ఎమ్మెల్యే ను చేసేందుకు అన్ని విధాలా కృషి చేశాడు. ఈ నేపథ్యంలోనే గుజరాత్‌ ఎన్నికలలో జూమ్ నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. రివాబా జడేజా ఘనవిజయం సాధించింది.

ఆమె తన ప్రత్యర్థి పై 61 వేలకు పైగా భారీ మెజారిటీ సాధించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. క్షత్రియ ప్రభాల్యం ఉన్న ఈ సెగ్మెంట్లో రవీంద్ర జడేజా భార్య భారీ మెజారిటీతో గెలుపొందింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 2012లో కాంగ్రెస్ టికెట్ పై ధర్మేంద్ర సింగ్ జడేజా గెలుపొందగా.. 2017 లో ఆయన పార్టీ మారి బిజెపి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

ఇక ఈసారి బిజెపి టికెట్ పై రవీంద్ర జడేజా భార్య రివాబా గెలుపొందారు.ఇదంతా పక్కకు పెడితే, తాజాగా గుజరాత్‌ కు చెందిన జడేజా, తమిళ గెటప్‌ లో కనిపించి, అందరినీ ఆశ్చర్య పరిచాడు. తెల్ల పంచలో మెరిసి.. తమిళ స్టైల్‌ అని ట్వీట్‌ చేశాడు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్‌ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు జడేజా రాజకీయాల్లోకి రానున్నాడా అని కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news