వల్లభనేని వంశీ పై గన్నవరంలో తిరుగుబాటు !

-

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై వైసీపీ క్యాడర్ తిరుగుబాటుని ప్రకటించింది. ఈ పంచాయతీ… తాడేపల్లి పార్టీ ఆఫీస్ వరకు చేరింది. ఇందులో భాగంగానే వైసిపి పార్టీ కీలక నేత, వ్యవహారాల శాఖ ఇంచార్జ్ విజయసాయిరెడ్డి కి గన్నవరం వైసిపి క్యాడర్ లేఖ రాసింది. గన్నవరం క్యాడర్ పేరుతో విజయసాయి రెడ్డి కి అందిన లేఖ పార్టీలో ఇప్పుడు సంచలనంగా మారింది.

గన్నవరం నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలను వల్లభనేని వంశీకి ఇవ్వద్దని లేఖలో పేర్కొన్నారు వైసీపీ నేతలు. తాము 9 సంవత్సరాల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గన్నవరంలో వైసిపి పార్టీని కాపాడుకుంటూ వస్తున్నానని వైసీపీ పార్టీ నేతలు తెలిపారు. నియోజకవర్గ బాధ్యతలు అప్పగించొద్దంటూ విజయసాయి రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు వైసీపీ పార్టీ కార్యకర్తలు. నియోజకవర్గ బాధ్యతలు వల్లభనేని వంశీకి తప్ప ఎవరికి ఇచ్చినా 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని విజయసాయిరెడ్డికి చెప్పారు నేతలు. అయితే.. దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news