క‌రోనాను అంతం చేయాలంటే.. రోజుకు 5 సార్లు హ‌నుమాన్ చాలీసా ప‌ఠించండి..

-

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ప్ర‌జ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచారు. క‌రోనా వైర‌స్‌ను నిర్మూలించాలంటే నిత్యం 5 సార్లు హ‌నుమాన్ చాలీసాను ప‌ఠించాల‌ని అన్నారు. అలా ఆగ‌స్టు 5వ తేదీ వ‌ర‌కు చేయాల‌న్నారు. దీంతో క‌రోనా నాశ‌నం అవుతుంద‌న్నారు.

recite hanuman chalisa daily 5 times till august 5th to end corona

ఆగ‌స్టు 5వ తేదీన అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయ‌నున్న సంగతి తెలిసిందే. అందులో ప్ర‌ధాని మోదీ పాల్గొన‌నున్నారు. అయితే ఆ తేదీ వ‌ర‌కు అంద‌రూ నిత్యం 5 సార్లు హ‌నుమాన్ చాలీసాను ప‌ఠించాల‌ని ఎంపీ ప్ర‌జ్ఞా సింగ్ అన్నారు. త‌రువాత ఆగ‌స్టు 5వ తేదీన అంద‌రూ ఇండ్ల‌లో దీపాలు వెలిగించి శ్రీ‌రాముడికి హార‌తి ఇవ్వాల‌ని.. దాంతో క‌రోనా న‌శిస్తుంద‌ని అన్నారు.

కాగా దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 48,661 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క రోజులోనే 705 మంది చ‌నిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13,85,522కు చేరుకుంది. 4,67,882 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 8,85,577 మంది కోలుకున్నారు. మొత్తం 32,063 మ‌ర‌ణాలు చోటు చేసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news