కరోనా వాక్సిన్ రేటు ప్రకటించిన రెడ్డీస్…!

-

భారత్ లో కరోనా వాక్సిన్ కి సంబంధించి ఇప్పుడు ప్రజలు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కరోనా వాక్సిన్ ని ప్రజలకు అందించడానికి ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా డాక్టర్ రెడ్డీస్ తన కరోనా వాక్సిన్ కి సంబంధించి ధరను ప్రకటించింది. డాక్టర్ రెడ్డిస్ భారత్ లో రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వీ వాక్సిన్ తయారి మొదలుపెట్టింది.

స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ధరను రూ .948 / గా ప్రకటించింది రెడ్డీస్. టీకా మొదటి మోతాదు హైదరాబాద్‌లో ఇస్తామని తెలిపింది. ఇక కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో బహిరంగ మార్కెట్ లో ఈ వాక్సిన్ ని విక్రయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దేశంలో వాక్సిన్ కొరత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో రష్యా వాక్సిన్ కాస్త కొరత తీర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news