రూ.1799కే రెడ్‌మీ ఇయ‌ర్‌బ‌డ్స్

-

మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. రెడ్‌మీ ఇయర్‌బ‌డ్స్ ఎస్ పేరిట భార‌త్‌లో నూత‌న ఇయ‌ర్‌బ‌డ్స్‌ను లాంచ్ చేసింది. ఇవి బ్లూటూత్ 5.0 ఆధారంగా ఫోన్ల‌కు క‌నెక్ట్ అవుతాయి. మోనో, బైనార‌ల్ మోడ్‌లో వీటిని ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే డైన‌మిక్ సౌండ్ డ్రైవ‌ర్ల‌ను ఏర్పాటు చేసినందున ఈ ఇయ‌ర్‌బ‌డ్స్ ఉత్త‌మ‌మైన సౌండ్ క్వాలిటీని ఇస్తాయి. వీటికి ఐపీఎక్స్‌4 వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. ఇవి 4 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఇస్తాయి. అదే చార్జింగ్ కేస్‌తో అయితే 12 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్ ల‌భిస్తుంది.

Redmi Earbuds S launched in India

రెడ్‌మీ ఇయర్‌బ‌డ్స్ ఎస్ స్పెసిఫికేష‌న్లు…

* బ్లూటూత్ 5.0 క‌నెక్టివిటీ, 7.20 ఎంఎం డైన‌మిక్ డ్రైవ‌ర్ యూనిట్
* మ్యూజిక్ ప్లే బ్యాక్ ట‌చ్ కంట్రోల్స్‌, సిరి, గూగుల్ వాయిస్ స‌పోర్ట్
* నాయిస్ క్యాన్సిలేష‌న్‌, ఐపీ ఎక్స్‌4 వాట‌ర్ రెసిస్టెంట్
* 3 సెట్ల సిలికాన్ ఇయ‌ర్ టిప్స్
* 43 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 4 గంట‌ల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్

కాగా ఈ ఇయ‌ర్‌బ‌డ్స్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌లో విడుద‌ల‌య్యాయి. వీటిని రూ.1799 ధ‌ర‌కు వినియోగ‌దారులు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోం స్టోర్‌, ఎంఐ స్టూడియో, అమెజాన్ సైట్ల‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news