ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ కీర్తి సురేషే ..!

-

“మహానటి” కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోను మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్. నేను శైలజ తో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తి సురేష్ ఆ తర్వాత నాని తో నేను లోకల్, పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, మహానటి సినిమాలు చేసింది. మహానటి సినిమాతో ఎవరూ ఊహించనంతగా పాపులారిటీని దక్కించుకుంది. ఇక తెలుగులో గ్లామర్ పాత్రలకి దూరంగా ఉన్న కీర్తి తమిళంలో మాత్రం గ్లామర్ పాత్రలు చేస్తుంది.

 

అయితే ఎక్స్‌ఫోజింగ్, లిప్ లాక్స్ కి మాత్రం కీర్తి సురేష్ తెలుగు అయినా తమిళం అయినా ససేమిరా అంటోంది. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ అంటే పూజా హెగ్డే, రష్మిక మందన్న అని ఒక టాక్ ఉంది. కాని కీర్తి సురేష్ ఈ ఇద్దరిని డామినేట్ చేసి వాళ్ళకంటే ఎక్కువ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ అని అనిపించుకుంటుంది.

పూజా హెగ్డే బాలీవుడ్ లో రెండు సినిమాలు, టాలీవుడ్ లో ప్రభాస్, అఖిల్ అక్కినేని సినిమాలు చేస్తుంది. అలాగే రష్మిక మందన్న అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తుంది. అలాగే కన్నడలో ఒక సినిమా, తమిళంలో ఒక సినిమా చేస్తుంది. కీర్తి సురేష్ పెంగ్విన్, నితిన్ రంగ్ దే, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ, సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాత్తే సినిమాలతో పాటు ఒక మళయాళం సినిమా ఉంది. అంటే మొత్తం 6 సినిమాలు చేస్తుంది. ఈ రకంగా చూస్తే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ కదా ..!

Read more RELATED
Recommended to you

Latest news