సికింద్రాబాద్ లో దారుణం : పెళ్లి పత్రికలో పేర్లు లేవని కత్తితో దాడి

-

పెళ్లి పత్రికలో పేర్ల కోసం జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసిన ఘటన సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపారు వైద్యులు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. అయితే.. నిందితునికి కత్తినిచ్చింది వారి తల్లేనని బాధితులు ఆరోపిస్తున్నారు. వివరాలలోకి వెళితే.. మూడు రోజుల క్రితం చంద్రశేఖర్ నగర్ కు చెందిన సురేష్ అనే వ్యక్తిది వివాహం జరిగింది.. అయితే పెళ్లి పత్రికలలో తమ పేర్లు ఎందుకు పెట్టలేదని బంధువు పెళ్లి రోజే సర్వేశ్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. అంతేకాదు.. సురేష్ సోదరి బాలమణిని దూషించాడు.. అయితే మిగతా బందువులందరు సర్ది చెప్పారు. ఈ గొడవ గురించి మాట్లాడదామని ఆదివారం ఉదయం బలామణి తన కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన బంధువులను తీసుకొని సర్వేశ్ ఇంటికి వెళ్లింది.

crime
crime

దీంతో సర్వేశ్, అతని సోదరుడు శేఖర్ ఇంటికి వచ్చిన వారిపైకి రెచ్చిపోయాడు. దీంతో సర్వేశ్, అతని సోదరుడు శేఖర్ ఇంటికి వచ్చిన వారిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఎస్ ప్రవీణ్ (30) నోముల పరశురాము(35), డి యాదగిరి (42), ఎన్ ప్రతాప్ కుమార్ (32)కు తీవ్రగాయాల పాలయ్యారు. గాయాలతోనే పోలీస్ స్టేషన్ వచ్చిన బాధితులు… దారి పొడవునా పోలీస్ స్టేషన్ లో సైతం రక్తం మరకలు పడ్డాయి. దీంతో పోలీసులు వెంటనే బాధితులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నిందితులు పరారయ్యారు. ఇందులో ఎస్ ప్రవీణ్, నోముల పరశురాము పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news