ఏపీ విద్యార్థులకు అలర్ట్..ఈఏపీసెట్‌ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు అలర్ట్. ఏపీ ఇంజనీరింగ్, వ్యవసాయ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను (ఈ ఏపీ సెట్) ను మేం మాసంలో… నిర్వహించనున్నారు. ఈ మేరకు..ఉమ్మడి ప్రవేశ పరీక్షకు చైర్మన్లు, కన్వీనర్లను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఏడాది ఈ ఏపీసెట్ నిర్వహణ బాధ్యతలను జె.ఎన్.టి.యు అనంతపురానికి అప్పగించారు.

సెట్ కన్వీనర్ గా విజయ్ కుమార్ ను ఉన్నత విద్యామండలి నియామకం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత నుంచి జె ఎన్ టి యు, కాకినాడ ఏపీసెట్ నిర్వహిస్తూ వస్తుండగా ఈ సారి మార్పు చేశారు.

ఇక ఈ పరీక్షలను కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ… నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రకటన చేశారు. మే మాసంలో కరోనా కేసులను బట్టి ఆ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. కరోనా విషయంలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి చేయాల్సిన అవసరం లేదని… పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news