కార్యకర్తలు ఆర్మీగా మారండి…కేటీఆర్‌ ను అడ్డుకోండి : రేవంత్‌ రెడ్డి

-

కాంగ్రెస్‌ కార్యకర్తలు అందరూ ఆర్మీగా మారండి… మంత్రి కేటీఆర్‌ పర్యటనలను అడ్డుకోండి పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. ఇవాళ తనను హౌస్‌ అరెస్ట్‌ చేయడంపై కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం కెసిఆర్ పోలీసులను ప్రైవేట్ సైన్యంగా మార్చారని… పోలీసులతో మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనికి నిరసనగా… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల పర్యటన లు అడ్డుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. కాంగ్రెస్స్ శ్రేణులు, nsui, యూత్ కాంగ్రెస్ నేతలు అందరూ పార్టీ ఆర్మీ గా మారాలన్నారు. నల్గొండ నుండి హైదరాబాద్ వచ్చే వరకు ఎక్కడైనా కేటీఆర్ నీ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు రేవంత్‌ రెడ్డి. తిక్క రెగితే..జైల్ భరో చేస్తామని.. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూస్తామని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కు వార్నింగ్‌ ఇచ్చారు రేవంత్‌. నూతన సంవత్సరం లో కార్యాచరణే..జైల్ భరో చేస్తామని హెచ్చరించారు. సీఎం కెసిఆర్, కేటీఆర్ లను ఉరి తీసినా తప్పు లేదని రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు.

 

Read more RELATED
Recommended to you

Latest news