కేసీఆర్ రద్దు అయ్యిపోయిన వెయ్యి నోటు: రేవంత్ రెడ్డి

-

మాజీ సీఎం కేసీఆర్ ఒక రద్దు అయిపోయిన 1000 నోటు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లాల పర్యటనకి వెళ్తున్న కేసీఆర్ ఇకనుండి ప్రతివారం కూడా బయటకి రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. కేసీఆర్ కి ఇప్పటికైనా రాష్ట్రంలో రైతులు ఉన్నారన్న విషయం గుర్తుకు వచ్చినందుకు సంతోషమని అన్నారు. రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతుల వివరాలను కేసీఆర్ ప్రభుత్వానికి ఇవ్వాలని ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు.

కేసీఆర్ లాగా తాము కమిషన్ల దందా చేయట్లేదని రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ పనుల కోసమే ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి. తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లని మంగళవారం రేవంత్ రెడ్డి పరిశీలించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చాక కరువు వచ్చిందని అంటున్నారు వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కి కరువు ఎప్పుడు వస్తుందో తెలియదా అని అడిగారు.

Read more RELATED
Recommended to you

Latest news