తెలంగాణ నుంచి కేసీఆర్ కుటుంబాన్ని వెలివేయాలి : రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర సమాజం నుండి కెసిఆర్ కుటుంబాన్ని వెలి వేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియా తో మాట్లాడుతూ.. టీ హబ్ నిర్మాణం లో కోట్లు కొల్లగొట్టిన వాడికే అమర వీరుల స్తూపం నిర్మాణం ఇచ్చారని.. నిర్మాణం విలువ 300 శాతం పెరుగుతుందా..? అని నిలదీశారు.

అవినీతి లో తేలు కుంట శ్రీధర్ సమన్వయ కర్త అని ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. వీళ్లంతా కేటీఆర్ కి కప్పం కడుతున్నారని.. కేటీఆర్ కి నజరానా ఇస్తు… వ్యయం పెంచుతున్నారని మండిపడ్డారు. సాంకేతిక నిపుణుల పేరుతో తేలు కుంట శ్రీధర్ ఆరు శాతం కమీషన్ ఇస్తున్నాడని.. ఆర్ అండ్ బీ అధికారులు ఉన్నాకా..? సాంకేతిక నిపుణులు ఎందుకు ? అని నిలదీశారు. ఆంధ్ర కాంట్రాక్టర్ కి పనులు ఇచ్చినందుకు సిఎం కెసిఆర్.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news