కేటీఆర్‌.. ముందుంది మొసళ్ల పండుగ..రేవంత్ రెడ్డి

-

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ జనవాడ ఫాం హౌస్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు ఇచ్చింది. అయితే దీన్ని జీర్ణించుకోలేని టిఆర్ఎస్ నేతలు ఈ మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రేవంత్ పై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్ అని, రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ సర్వనాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. రేపటి నుంచి రేవంత్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తాయని హెచ్చరించారు. అయితే, దీనిపై రేవంత్ దీటుగా స్పందించారు. “ముందుంది మొసళ్ల పండుగ… రేపు మధ్యాహ్నం 1 గంటకు!” అంటూ ఈ వ్యవహారంలో తాను వెనుకంజ వేసేది లేదన్న బలమైన సంకేతాలు పంపించారు. అయితే రేపు రేవంత్ ఏంచేయనున్నారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news