గుజరాత్​-దిల్లీ మ్యాచ్​లో రిషబ్ పంత్ సందడి.. ఫొటో వైరల్

-

IPL​ 16వ సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 4న గుజరాత్‌ టైటాన్స్‌-దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మంగళవారం రోజున మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. హోమ్​ గ్రౌండ్‌ అయిన అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు స్టార్ క్రికెటర్​ రిషభ్​ పంత్‌ హాజరయ్యాడు. ఫిజియో సాయంతో మ్యాచ్‌కు హాజరైన పంత్‌.. దిల్లీ క్యాపిటల్స్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ బయట కూర్చొని మ్యాచ్​ను వీక్షిస్తూ ఎంజాయ్​ చేశాడు. అయితే పంత్‌ను చూసిన అభిమానులు ఒక్కసారిగా ఎమోషనల్​ అయ్యారు. ‘మిస్‌ యూ పంత్‌’.. ఆర్​పీ 17 అంటూ బ్యానర్లు, ఫ్లకార్డులు పట్టుకుని కనిపించారు.

ఈ మ్యాచ్​లో షార్ట్‌, వైట్‌ టీషర్ట్‌ వేసుకున్న పంత్‌.. కర్ర సాయంతోనే మ్యాచ్‌కు వచ్చాడు. ఫ్యాన్స్​కు హాయ్ చెబుతూ.. ఆ తర్వాత దిల్లీ క్యాపిటల్స్‌ డగౌట్‌ వైపు చిరునవ్వుతో చూశాడు. పంత్‌ను చూసిన సౌరవ్‌ గంగూలీ, హెడ్‌కోచ్‌ పాంటింగ్‌ సహా దిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయర్స్​ హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

గతేడాది డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు రిషభ్​ పంత్‌. గాయాల వల్ల జాతీయ జట్టు ఆడే మ్యాచులతో పాటు ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న అతడు మెల్లగా కోలుకుంటున్నాడు. పంత్​ను మిస్ అవుతున్నట్లు.. దిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటికే పలుసార్లు చెబుతూ వచ్చింది. ఈ క్రమంలోనే పంత్‌ను స్టేడియానికి తీసుకొచ్చింది. మ్యాచ్‌లు ఆడకపోయినా పంత్‌ తమతో ఉంటే ధైర్యంగా ఉంటుందని ఆ జట్టు హెడ్​ కోచ్​ పాంటింగ్‌ అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news