BREAKING : సీఎం కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తో రాష్ట్రీయ జనతా దళ్‌ నేత తేజస్వీ యాదవ్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌ లో సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం అయిన ప్రగతి భవన్‌ కు చేరుకున్న తేజస్వీ యాదవ్‌ నేతృత్వం లోని ఆర్జేడీ బృందం… ఆయనతో సమావేశం అయ్యారు. తేజస్వీ యాదవ్‌ బృందంలో సమాజ్‌ వాదీ పార్టీ నేతలు అబ్దుల్‌ బారీ సిద్ధిఖీ, సునీల్‌ సింగ్, భోలా యాదవ్‌ కూడా ఉన్నారు.

వీరిద్దరు జాతీయ రాజకీయాలపై చర్చిస్తున్నట్లు గా సమాచారం అందుతోంది. దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, ప్రాంతీయ పార్టీలు పోషించాల్సిన పాత్ర పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. బిహార్‌ విపక్ష నేతగా ఉన్న తేజస్వి యాదవ్‌.. బీజేపీ పార్టీ వ్యతిరేకంగా బలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ కూడా గత కొన్నిరోజుల నుంచి బీజేపీ పార్టీ పై తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి తరుణంలో.. వీరిద్దరూ భేటీ కావడం దేశ వ్యాప్తంగా చర్చినీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news