పూజా హెగ్డే పై రోజా భర్త సంచలనం..12మంది అవసరమా.. ?

-

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను సినిమాలు చేస్తున్న హీరోయిన్ పూజ హెగ్డే. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ పై ఇప్పుడు విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా రోజా భర్త తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడు రోజా సెల్వమణి పూజా హెగ్డే పై సంచలన ఆరోపణలు చేశారు. ఒకప్పుడు డు పూజా హెగ్డే తన మొదటి సినిమా హీరో జీవా తో చేసినప్పుడు ఓకే అసిస్టెంట్ ను వెంటబెట్టుకుని వచ్చేది అని అన్నారు.

కానీ ప్రస్తుతం 12 మంది అసిస్టెంట్లను వెంట తీసుకుని వస్తుందని చెప్పారు. హీరోయిన్లు రెమ్యునరేషన్ పెంచడంతోపాటు తమ వెంట అసిస్టెంట్లను కూడా పెంచడంతో నిర్మాతలకు అదనపు భారంగా మారుతుందని చెప్పినట్టు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా హీరోయిన్ల అసిస్టెంట్ల విషయంలో వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు పూజా హెగ్డే పై రోజా భర్త ఆగ్రహం వ్యక్తం చేయడం వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు పూజా హెగ్డే ఒక్కో సినిమాకు మూడు కోట్ల పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news