పెళ్లి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదం లో ఆరుగురు దుర్మరణం

-

ఈ మధ్య కాలంలో తరచూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అతివేగంతో క్షణాల్లో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వాటిని మాత్రం ఎవ్వరూ పాటించడం లేదు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్లితే.. వారంలో పెళ్లి వేడుకలు జరగాల్సిన కుటుంబంలో మృత్యుఘోష వినిపించింది. వివాహ దుస్తుల కోసం HYD వెళ్లి వస్తుండగా అనంతపురం (D) గుత్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొట్టడంతో కారులోని కాబోయే పెళ్లి కొడుకు షేక్ సురోజ్(28)తో సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. నలుగురు స్పాట్లో చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. వీరంతా అనంతపురానికి చెందినవారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news