కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

-

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాణ్యం సమీపంలోని ఓర్వకల్లు రాక్‌ గార్డెన్‌ వద్ద ట్రాక్టర్‌-టవేరా కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

మృతులను మార్చురీకి తరలించారు. అలాగే మృతులంతా కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వారుగా తెలుస్తోంది. ట్రాక్టర్‌కు లైట్లు సరిగా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news