ఏపీని క్రీడా ఆంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చేస్తా – మంత్రి రోజా

-

ఏపీని క్రీడా ఆంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చేస్తానని మంత్రి రోజా పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ మంత్రి హోదా లో శాప్ పై తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు రోజా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… క్రీడల్లో సరైన ప్రోత్సాహం లేక పోవడంతో వెనుకబడి పోతున్నారని… ప్రతి నియోజకరంలో స్పోర్ట్స్ క్లబ్ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

జీవితంలో స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యమని… సెల్ ఫోన్స్ వల్ల స్పోర్ట్స్ కు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. పిల్లలు చిన్న విషయాలకు డిప్రెషన్ అవుతున్నారు , సెన్సిటివ్ గా మారుతున్నారని.. స్పోర్ట్స్ ఆడటం వల్ల మానసిక స్థైర్యం వస్తుందన్నారు మంత్రి రోజా. ఫైర్ అనేది ఇన్ బిల్ట్.. చెడు మీద ఫైర్ అలాగే కొనసాగుతుందని… నేను ఎప్పుడూ సీఎం జగన్మోహన్ రెడ్డి నే ఫాలో అవుతా.. మనం చేసే అభివృద్ధి పనులు సమాధానం చెబుతాయని వెల్లడించారు. ఏపీలో జగనన్న పాలన ఎంతో అద్భుతంగా ఉందని చెప్పారు మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news