పులివెందులలో జగన్ ను ఓడించే మగాడు పుట్టలేదు – ఏపీ మంత్రి రోజా

-

ఎన్నికల్లో గెలిచామని చంకలు గుద్దుకుంటున్న చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడులకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ మంత్రి రోజా విసిరారు. చంద్రబాబు, లోకేష్ గల్లీ గల్లీ తిరిగిన వెల్లగొట్టారని రోజా అన్నారు. పార్టీ సింబల్ ఉండే ఎన్నికలు వస్తే ప్రజలంతా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకే ఓటేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

2024 లోను ప్రజలు జగన్ తోనే ఉంటారని తెలిపారు. ఇక పులివెందులలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించే మగాడు పుట్ట లేదని మంత్రి రోజా ధీమా వ్యక్తం. చేశారు దమ్ముంటే ‘వై నాట్ పులివెందుల’ అన్న వ్యక్తి వచ్చి పులివెందులలో పోటీ చేయాలని టిడిపి నేతలకు సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని సంబరాలు చేసుకోవడం అంతా శున కానందం ఇంకొకటి ఉండదన్నారు. విశాఖపట్నం టిడిపి అభ్యర్థి చిరంజీవిరావు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఇంకా మంచి ఓట్లే వచ్చేవని వాక్యానించారు ఏపీ మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news