బావ, బామ్మరదులు UNSTAPABLE గా ప్రజలను మోసం చేస్తున్నారు – రోజా

-

బావ, బామ్మరదులు UNSTAPABLE గా ప్రజలను మోసం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి రోజా. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా… హాట్‌ కామెంట్స్‌ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే మూడు రాజధానుల ఏర్పాటు చెయ్యాలని జగన్ నిర్ణయించారు..రాయలసీమ బిడ్డగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నానన్నారు.

బినామీల పేర్ల పైన వున్న ఆస్తులను కాపాడుకోవడానికే చంద్రబాబు అమరావతిని రాజధాని చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు…పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు అమరావతి ఉద్యమాని చేయిస్తున్నాడని నిప్పులు చెరిగారు. దొంగ రైతులతో ఉద్యమాని నడుపుతూ ఉత్తరాంధ్రలో ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు…పార్టీలకతీతంగా చేపడుతున్న ఉత్తరాంధ్ర గర్జనకు మద్దతు ఇస్తున్నాన్నారు. బావ,బామ్మరదులు అన్ స్టోప్పబుల్ గా ప్రజలను మోసం చేస్తున్నారు…ఎన్టీఆర్ ను అవమానించి…మరణానికి కారణం అయ్యిన బాబు…ఈ రోజూ ఆరాధ్యదైవం అనడం సిగ్గుచేటు అని మండిపడ్డారు రోజా.

Read more RELATED
Recommended to you

Latest news