త్వరలోనే రూ.2 లక్షల రైతు రుణమాఫీ: మాజీ మంత్రి జానారెడ్డి

-

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కోదాడలో కాంగ్రెస్ నిర్వహించిన ఓ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని అన్నారు .ఇచ్చిన హామీలు నేరవేర్చలేదు కాబట్టే బీఆర్ఎస్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించారని తెలిపారు. రుణమాఫీ చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు.అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా త్వరలోనే మేం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు.

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి నల్లగొండ లోక్ సభ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొడుకు గెలుపు కోసం రంగంలోకి దిగిన జానారెడ్డి.. నల్లగొండ లోక్ సభ పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news