ఈ స్కీమ్‌లో చేరిన వారికీ ప్రతి నెలా రూ.3,000..!

-

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయారు. వారికీ అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక రైతులకు ఆర్థిక మద్దతు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో పీఎం కిసాన్ స్కీమ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పథకంలో చేరిన వారికి సంవత్సరానికి రూ.6,000 వస్తుంది. మూడు విడతల్లో రూ.2,000 చొప్పున ఈ డబ్బులు పొందొచ్చు. ఈ స్కీమ్ మాత్రమే కాకుండా రైతుల కోసం మరో స్కీమ్ కూడా అందుబాటులో ఉంది.

raithu
raithu

ఆ పథకమే ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ ధన్ యోజన. ఈ స్కీమ్‌లో రైతులు చేరొచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన రైతులకు ప్రతి నెలా రూ.3,000 లభిస్తాయి. అయితే దీని కోసం రైతులు ముందు నుంచే ప్రతి నెలా చిన్న మొత్తంలో డబ్బులు కడుతూ రావాలి. ఇది పెన్షన్ స్కీమ్ అని చెప్పవచ్చు. అంతేకాదు పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిన వారు ఆటోమేటిక్‌ గానే ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా.. కిసాన్ మాన్ ‌ధన్ యోజన స్కీమ్‌లో చేరొచ్చు. ఇక డబ్బులు ఆటోమేటిక్ ‌గానే బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతాయి. అంతేకాక 60 ఏళ్లు దాటిన రైతులు ప్రతి నెలా రూ.3,000 పొందొచ్చు. అంటే సంవత్సరానికి రూ.36,000 పొందుతారు.

ఇక 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న రైతులు ఎవరైనా సరే కిసాన్ మాన్ ధన్ యోజన పథకంలో చేరడానికి అర్హులు. అయితే నెలకు రూ.55 నుంచి రూ.200 మధ్యలో చెల్లిస్తూ రావొచ్చు. మీ వయసు ప్రాతిపదికన మీరు చెల్లించాల్సిన డబ్బులు మారతాయి. 18 ఏళ్లకే స్కీమ్‌లో చేరితే నెలకు రూ.55 కట్టాలి. వీటితోపాటు 5 ఏకరాలకు లోపు పొలం ఉండాలి. అంతేకాకుండా ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌వో స్కీమ్స్‌ లో చేరిన వారు ఈ స్కీమ్‌లో చేరేందుకు అనర్హులు.

Read more RELATED
Recommended to you

Latest news