రూ. 4వేల కోట్లతో నారాయణపేట్ కొడంగల్ ఎత్తి పోతల పథకం: సీఎం రేవంత్ రెడ్డి

-

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామనీ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పక్కనే కృష్ణా నది పారుతున్న ఈ ప్రాంతానికి చుక్క నీరు లేదనీ ఆవేదన వ్యక్తం చేశారు.4వేల కోట్లతో కొడంగల్, మక్తల్,నారాయణపేట్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి ఈ ఫ్రాంతానికి లక్షా 30 వేల ఎకరాలకు నీళ్లిస్తామనీ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ పేట జిల్లాలో కాంగ్రెస్ జనజాతర పేరిట సోమవారం బహిరంగ సభ నిర్వహించింది.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…రజకుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అయిండు.. మక్తల్ లో ముదిరాజ్ బిడ్డకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామన్నారు. కేసీఆర్ ముదిరాజ్ బిడ్డలకు ఒక్క టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు. అందుకే వంద అడుగులు గోతిలో బీఆర్ఎస్ ను పాతి పెట్టారని అన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యానికి ముదిరాజులు నష్టపోయారని విమర్శించారు.

ఎంతోకాలంగా నారాయణపేట్, కొడంగల్, పరిగి, వికారాబాద్ ప్రజలు రైల్వే లైన్ కోసం ఎదురు చూస్తునారని అన్నారు.గతంలో వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ ను ఆనాడు కాంగ్రెస్ కేటాయించింది.. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేసి ఆపాయి.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ తెస్తామన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news