జైలులో ఉన్న బిడ్డ కోసం ..కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు: రేవంత్ రెడ్డి

-

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ పేట జిల్లాలో కాంగ్రెస్ జనజాతర పేరిట సోమవారం బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు.

‘జైలులో ఉన్న బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, బీఆర్ఎస్ ను మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారు. బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి మళ్లించాలని కేసీఆర్ చెప్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు ప్రచారమే చేయట్లేదు’ అని వ్యాఖ్యానించారు.మల్కాజిగిరి, భువనగిరి, మహబూబ్ నగర్, చేవేళ్ల, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ ప్రచారం చేయడం లేదని ఆరోపించారు. ఈ ఐదు స్థానాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news