రూ. 300 రూపాయల కోసం హత్య?

-

కరీంనగర్ జిల్లా శంకర్ పల్లిలో దారుణం చోటుచేసుకుంది.ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి ఓ వ్యక్తిపై దాడి చేసి అతని జేబులో నుంచి రూ. 300 రూపాయలు, సెల్ ఫోన్ తీసుకొని అతన్ని దారుణంగా బండరాయితో మోది హతమార్చారు.ఈ సంఘటన గత నెల 25న శంకర్ పల్లి లోని వడ్డెర స్మశానవాటికలో జరిగింది.నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని గురువారం రిమాండ్ కు తరలించారు.శంకర్ పల్లి సిఐ మహేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్ జిల్లా మెట్ పల్లి కి చెందిన సాయిలు(35).మల్లేష్ (45) అన్నదమ్ములు.ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్నారు.

శంకర్ పల్లి లో నివాసముండే మల్లేష్ వద్దకు గత నెల 25 న సాయిలు వచ్చాడు.ఇద్దరూ కలిసి మద్యం సేవించారు.నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం చెరుకు పల్లికి చెందిన చెన్నయ్య(55) ఏదో సమాచారం కోసం వీరితో మాట్లాడగా..వీళ్ళు తాగిన మైకంలో అతన్ని అకారణంగా కొట్టారు.ఆ సమయంలో చెన్నయ్య జేబులో నుంచి రూ.300 , సెల్ ఫోన్ కిందపడగా..వాటిని సాయిలు మల్లేష్ చూశారు.చెన్నయ్య వాటిని తీసుకుని కొద్దిదూరం వెళ్లగా…అతన్ని గట్టిగా పట్టుకొని స్మశానవాటికలోకి తీసుకెళ్లి బండరాయితో మోది హత్య హత్యచేసి రూ.300.సెల్ ఫోన్ తీసుకొని పరారయ్యారు.సీసీటీవీ వీడియో ఆధారంగా నిందితులను పట్టుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news