ఎస్సై పరీక్షల తేదీని మార్చండి : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

-

తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు సైతం ఆయా పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే అందులో పోలీసులు ఉద్యోగాల భ‌ర్తీలో భాగంగా పోలీసు శాఖ‌లో ఎస్సై పోస్టుల భ‌ర్తీకి సంబంధించి ఆగ‌స్టు 7న రాత ప‌రీక్ష నిర్వహించ‌నున్న‌ట్లు తెలంగాణ స్టేట్ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్‌పీఆర్బీ) ప్ర‌కటించింది. ఈ తేదీని మార్చాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వానికి మంగళ‌వారం విజ్ఞ‌ప్తి చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

ఎస్సై పోస్టుల రాత ప‌రీక్ష తేదీని మార్చాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను కూడా చెబుతూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ట్వీట్ పోస్ట్ చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఆగ‌స్టు 7న సీఏపీఎఫ్ అసిస్టెంట్ క‌మాండెంట్ ప‌రీక్ష‌తో పాటు బ్యాంకు ఉద్యోగాల భ‌ర్తీకి దేశ‌వ్యాప్తంగా ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలిపారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఈ ప‌రీక్ష‌ల‌కు తెలంగాణ‌కు చెందిన నిరుద్యోగులు హాజ‌ర‌వుతున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఈ క్ర‌మంలో ఎస్సై పోస్టుల రాత ప‌రీక్ష‌ను మ‌రో తేదీకి మార్చాల‌ని కోరారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version