కంటైనర్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి

-

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇంటి నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేకుండా పోయింది. తాను జాగ్రత్తగా ఉన్నప్పటికీ పక్క వారి వల్ల ప్రమాదం పొంచి ఉంది. అటు బస్సుల్లో కూడా ప్రమాదాలు జరుగుతుండటం గమనార్హం.

తాజాగా ఆర్టీసీ బస్సు, హెవీ కంటైనర్ ని ఢీకొట్టిన ఘటనలో ఒకరు దుర్మరణం పాలైన ఘటన నెల్లూరు జిల్లా మద్దూరుపాడు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గిద్దలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు ముందుకు వెళ్తున్న కంటైనర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలవ్వగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కావలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news