చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. 25 మందికి గాయాలు

-

మహారాష్ట్రలోని పుణెలో రోడ్డు ప్రమాదం జరిగింది. యావత్ గ్రామంలోని సహజూర్ ఫాటా సమీపంలో రాష్ట్ర రవాణా బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ఆదివారం పూణె జిల్లాలో చెట్టును ఢీ కొనడంతో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పంఢర్పూర్ (షోలాపూర్ జిల్లా) నుంచి ముంబై వైపు బస్సు వెళ్తుండగా యావత్ గ్రామంలోని సహజ్పూర్ పాటా దగ్గర ఈ ఘటన జరిగింది. ముగ్గురు నుంచి నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించినట్లు యావత్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్ స్పెక్టర్  నారాయణ్ దేశ్ ముఖ్ తెలిపారు. ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటీ అనేది మాత్రం తెలియడం లేదు. అతివేగమా..? లేక బ్రేకు ఫెయిల్ అయిందా..? కారణం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news