వాగులో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు.. వీడియో వైరల్

-

తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాలతో నదులు మరియు వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో చాలా చోట్ల రవాణా కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.   అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లో మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలోనే మానేరు వాగు పై ఉన్న లో లెవెల్ వంతెనపై నిన్న ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది.

ఇవాళ ఉదయం ప్రవాహ ఉధృతి మరింత పెరగ డంతో బస్సు… ఆ వాగులో కొట్టుకుని పోయింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సులు బయటకు తీసేందుకు అధికారులు సాహసించలేదు. దీంతో బస్సు పూర్తిగా ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయింది. ఇక నిన్న నీటిలో చిక్కుకున్న సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే వీరందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు అధికారులు. నిన్న బస్సులు జెసిబి సహాయంతో తీసేందుకు ప్రయత్నించిన.. అధికారుల ప్రయత్నాలు విఫలమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news