TSRTC: కరీంనగర్‌లో హైటెన్షన్.. చర్చలు జరిపితేనే అంత్యక్రియలు

-

ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రగులుతోంది. ఆర్టీసీ డ్రైవర్ నంగునూరి ఆనంద్ బాబు హార్ట్ అటాక్‌తో మృతి చెందారు. అయితే ఆయనకు అంత్యక్రియలు చేేసేందుకు కుటుంబ సభ్యులతో పాటు కార్మిక సంఘాలు కూడా ఇష్టపడటం లేదు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపితేనే తాము అంత్యక్రియలు నిర్వహిస్తామని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ నేడు కరీంనగర్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది.

ఆర్టీసీ కార్మికులందరూ ఇప్పటికే కరీంనగర్ చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మందకృష్ణ మాదిగతో పాటు జేఏసీ నేతలందరూ కరీంనగర్ చేరుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిన్న ధర్నా కూడా నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news