దిశ ఎన్ కౌంటర్ : నేడు విచారణకు ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్….

-

దేశ వ్యాప్తంగా దిశ హత్య కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఘటనలో నిందితులను పోలీసులు ఎన్‌ కౌంటర్‌ చేశారు. ఈ ఎన్‌ కౌంటర్‌ పై ఇంకా విచారణ జరుగుతోంది. ఈ కేసులో దిశ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే… నేడు దిశ కమిషన్ విచారణ కు హాజరుకానున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్.

cp-sajjanar
cp-sajjanar

దిశ ఎన్ కౌంటర్ కేసులో సైబరాబాద్ సీపీ గా ఉన్న సజ్జన్నార్… సజ్జన్నార్ విచారణ కు హాజరు కావాలని జ్యుడీషియల్ కమిషన్ ఇటీవలే సమన్స్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ దిశ కమిషన్ విచారణ కు హాజరుకానున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్. నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ పై సజ్జన్నార్ స్టేట్మెంట్ నమోదు చేయనున్న కమిషన్… ఇప్పటికే ఎన్ కౌంటర్ బాధిత కుటుంబాలను, సిట్ చీఫ్ మహేష్ భగవత్, పలువురు సాక్ష్యుల వాగ్మూలాలు నమోదు చేసుకుంది. ఇక ఇవాళ్టి సజ్జన్నార్ విచారణ కీలకంగా మారనుంది.

Read more RELATED
Recommended to you

Latest news