BREAKING : తెలంగాణలో పెరిగిన ఆర్టీసీ టికెట్ ఛార్జీలు.. !

-

ఖైరతాబాద్ రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు పై కాసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆఫీస్ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే… ఈ సమావేశంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందు తోంది.

పల్లె వెలుగు బస్సులకు కిలోమీటర్ కు 25 పైసలు మరియు ఎక్స్‌ ప్రెస్‌ లు ఆపై సర్వీసులకు 30 పైసలు పెంచాలని రవాణా శాఖ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే…. సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు మరియు మెట్రో డీలక్స్ సర్వీసులకు 30 పైసలు పెంచాలని రవాణా శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తరువాత అధికారికంగా ప్రకటించనుంది ఆర్టీసీ యాజమాన్యం. దీంతో తెలంగాణ ప్రజలకు భారం పడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news